అవ్వా: నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతి వాటం......!

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో కొందరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.

 Thieves Pickpocketing In Nayini Narasimha Reddy Funerals, Nayini Narasimha Redd-TeluguStop.com

జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించిన విష‌యం తెలిసిందే.గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు.

వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ.ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో దవాఖానకు తరలించారు.అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన గత అర్ధరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు.దీనితో ఆయన అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని పార్థీవ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.

అంత్య‌క్రియ‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.వారందరితో పాటు పెద్ద ఎత్తున జనం కూడా తరలిరావడం తో అక్కడ జనసందోహం చోటుచేసుకుంది.

అయితే ఈ సమయంలోనే జేబు దొంగలు తమ చేతి వాటం చూపించారు.ఎవరికీ వారు నాయిని అంత్యక్రియల్లో మునిగిపోగా, దొంగలు మాత్రం ప్రజాప్రతినిధుల జేబులు కొట్టేసే పనిలో పడ్డారు.

అయితే ఓ ప్రజాప్రతినిధి పర్సు కొట్టేస్తున్న సమయంలో గుర్తించిన వారు గ్యాంగ్‌లో ఒకడిని పట్టుకోవడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అనంతరం పలువురు తమ పర్సులను తడుముకోగా వారి పర్సులు కూడా పోయినట్లు గుర్తించి ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

దీనితో గ్యాంగ్ లో దొరికిన ఆ ఒక్కడిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube