కాళేశ్వరంలో అవినీతి హద్దులు దాటిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు.సరైన అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మించారన్నారు.అవాస్తవాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.పంప్ లను టెక్నికల్ గా సరైన పద్ధతిలో అమర్చలేదని, ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
పంప్ ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉందన్నారు.ఈ కారణాలతోనే ఇటీవల భారీ వర్షాలకు మూడు పంప్ హౌజ్ లు మునిగిపోయాయని వ్యాఖ్యనించారు.