ప్రముఖ నటి ఇంట్లో చోరీ తాళాలు పగలగొట్టి మరీ?

ప్రముఖ సీనియర్ నటి వినయ్ ప్రసాద్ ఇంట్లో దొంగలు పడి లాకర్ లో ఉన్న డబ్బును మొత్తం దోచుకెళ్లిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నటి వినయ్ ప్రసాద్ ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందారు.

తెలుగులో కూడా ఈమె దూకుడు, ఆంధ్రుడు, ఇంద్ర దొంగ దొంగది వంటి ఎన్నో సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వినయ్ ప్రసాద్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది.

బెంగుళూరులోని నందిని లే అవుట్ లో నివాసం ఉంటున్న వినయ్ ప్రసాద్ దీపావళి పండుగ సందర్భంగా ఉడిపి వచ్చారు.ఇలా దీపావళి పండుగను ఉడిపిలో జరుపుకొని తిరిగి అక్టోబర్ 26న బెంగళూరు వెళ్ళిన ఈమె తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దొంగలు ఇంటి తాళాలను పగలకొట్టి ఇంట్లో లాకర్లో ఉన్న డబ్బును దొంగలించి తీసుకెళ్లారని ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విధంగా వినయ్ ప్రసాద్ లేఅవుట్ పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం 4:30 ఇంటికి తిరిగి వచ్చిన ఈమె తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అయితే దొంగలు ఎంత మేరా డబ్బును దొంగలించారు.

అనే విషయాలను తెలియచేయలేదు.ఈ క్రమంలోనే పోలీసులు పాత దొంగల ముఠా, దోపిడీ దొంగలు, నేర నేపథ్యం ఉన్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు