భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది.ఈ బోర్డర్-గవాస్కర్ సిరీస్ తొలి టెస్టు నాగ్పూర్లో ప్రారంభం కానుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు భారత్ను ఊరిస్తోంది.భారత జట్టుకు ఈ టెస్టు సిరీస్ చాలా ముఖ్యమైనది.
ఈ టెస్ట్ సిరీస్లో భారత జట్టు 2-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తే, అప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంటుంది.ఇప్పటికే భారత్ వన్డేలలో, టీ20లలో మొదటి ర్యాంకులో కొనసాగుతోంది.
టెస్టు సిరీస్లోనూ విజయం సాధిస్తే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా మారే అరుదైన అవకాశం లభించనుంది.దీంతో ఈ టెస్టు సిరీస్పై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియాకు మెరుగైన స్థితిలోనే ఉంది.భారత జట్టు 115 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా జట్టు మొదటి ర్యాంకులో ఉంది.ఈ పరిస్థితుల్లో టెస్ట్ ఫార్మాట్లో నంబర్ 1 ర్యాంకును పొందడానికి టీమ్ ఇండియాకు గొప్ప అవకాశం ముందుంది.ఇదే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోవడానికి భారత్కు ఈ టెస్టు సిరీస్ సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు.
ఇందులో రెండు టెస్టులను గెలుచుకున్నా భారత్ ఫైనల్ చేరుకుంటుంది.టెస్ట్ సిరీస్ను 3-1 తేడాతో లేదా 4-0తో గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుకునే అవకాశం ఉంటుంది.వన్డేలలో 114 రేటింగ్ పాయింట్లతో భారత్ జట్టు తొలి ర్యాంకులో కొనసాగుతోంది.టీ20లలో సైతం మొదటి ర్యాంకులో కొనసాగుతోంది.267 రేటింగ్ పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి.న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను 2-1తో గెలిచిన తర్వాత తొలి ర్యాంకు పదిలం అయింది.త్వరలో జరగనున్న టెస్టు సిరీస్లోనూ భారత్ విజయం సాధిస్తే మూడు ఫార్మాట్లలోనూ తొలి ర్యాంకులో కొనసాగే అరుదైన అవకాశం భారత్కు లభిస్తుంది.