భర్తను రోకలితో కొట్టి చంపిన భార్య !

వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను రోకలితో కొట్టి చంపింది.పెళ్లై 20 రోజులకే భార్య ఈ దుర్మార్గానికి పాల్పడింది.

మద్యంకి బానిసైన భర్త తరచూ గొడవలకు దిగడం, బండబూతులు తిట్టడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

టప్పాచబుత్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన గోల్కొండ జిల్లా ముజాహెద్ నగర్ లో చోటు చేసుకుంది.

కాలనీకి చెందిన అస్లాం (25), సమ్రిన్ దంపతులు.వీరికి గత నెల (ఆగస్టు) 19వ తేదీన వివాహం జరిగింది.

Advertisement

సంతోషంగా సాగాల్సిన వీరి జీవితం రోజూ గొడవలకే పరిమితమయ్యేది.పెళ్లి రోజు నుంచే అస్లాం తాగి వచ్చి గొడవలకు దిగేవాడు.

రోజూ బండబూతులు తిడుతూ వేధించేవాడు.గురువారం రాత్రి కూడా తాగి ఇంటికి రావడంతో వీరి మధ్య గొడవ చెలరేగింది.

అలా గొడవ పడి అస్లాం పడుకున్నాడు.శుక్రవారం ఉదయం పూట భార్య సమ్రిన్ రోకలితో అస్లాం తలపై బాదింది.

దీంతో అస్లాం గట్టిగా కేకలు వేయడంతో ఇంటి సభ్యులు అక్కడి చేరుకున్నారు.తలపై గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

దీంతో అస్లాంను కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్లాం మరణించాడు.

Advertisement

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.ఈ మేరకు అస్లాం భార్య సమ్రిన్ ను అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించారు.

తాజా వార్తలు