ఇంతకుముందు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి ఫైన్ వేసేవారు.కానీ ఇప్పుడు సింపుల్గా ఫొటో తీసి ఛలాన్స్ వేస్తున్నారు.
దీనివల్ల ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారు వారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు.అందర్నీ క్రమశిక్షణలో పెట్టాలంటే ఇలాంటి రూల్స్ తప్పనిసరి అని చెప్పొచ్చు.
కానీ ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు చేసే పొరపాట్ల వల్ల కొందరు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులు ఆఫర్ చేసే ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇందుకు కారణం అంబులెన్స్ హై స్పీడ్గా వెళ్తోందంటూ వీరు భారీగా ఫైన్స్ విధిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఓ అంబులెన్స్కి ఓవర్ స్పీడ్ కారణంగా ఫైన్ విధించారు.
ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.సాధారణంగా సీరియస్గా ఉండి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న రోగులను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్లు వేగంగా వెళ్తాయి.
అది కూడా అర్థం చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా ఫైన్ లు బాదేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రైవేట్ అంబులెన్స్ వాహనదారులు వాపోతున్నారు.సరైన గిరాకీ లేక అంబులెన్స్ నడపలేకపోతున్నామని ఇలాంటి సమయంలో పోలీసులు తమపై ఫైన్లు వేస్తూ అధిక భారం మోపడం అస్సలు బాగోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు విధించే ఫైన్స్ కట్టలేక తాము అప్పుల పాలవుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారుతోందని మరికొందరు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.మరి వీరి విజ్ఞప్తి మేరకు పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.