అనర్హత వేటుపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ తనను చూసి భయపడుతున్నారన్నారు.
ఈ క్రమంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.
అనర్హత వేటు వేసినా.
జైలులో పెట్టినా తన పోరాటం ఆగదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు.
లండన్ లో ప్రసంగంపై మంత్రులు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.