సంజయ్ పాదయాత్ర ! వీళ్లు ఇలా వాడేస్తున్నారుగా ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నారు.తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ఆయన పాదయాత్ర జరుగుతోంది.

రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి 2023 లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా సంజయ్ కష్టపడుతున్నారు.తెలంగాణ బిజెపిని బలోపేతం చేయడంతో పాటు, తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా హుజురాబాద్ లో ఉప ఎన్నికలు ఉండడంతో అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక్కడ బిజెపికి విజయం దక్కేలా చేయడంవల్ల తన బలం ఏంటో కేంద్ర బిజెపి పెద్దలకు తెలుస్తుంది అనే అభిప్రాయంలో సంజయ్ ఉన్నారు.

ఇదిలా ఉంటే  సంజయ్ యాత్రలో నాయకుల వారసుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.ఇప్పుడు యాత్ర లో భాగస్వామ్యం అవుతూ యాత్రను సక్సెస్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తమకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు వారసుల  కుమారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

అందుకే సంజయ్ పాదయాత్రలో యువ నాయకులు సందడి ఎక్కువగా కనిపిస్తోంది.అంతేకాదు ఈ పాదయాత్రలో వారు కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు పాదయాత్ర కమిటీలో వారసులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా సంజయ్ వారికి బాధ్యతలు అప్పగించారు.దీంతో తమ బలం నిరూపించుకునేందుకు వారి కుమారులు గట్టిగానే కష్టపడుతున్నారు.

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ యాత్రకు సహా ఇంచార్జి గా పనిచేస్తూ తన సత్తా చాటుకుంటున్నారు.

 అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఈ పాదయాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్  ఈ పాదయాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.అలాగే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి సంగ్రామ యాత్రలో పాల్గొన్న సంజయ్ వెంట నడుస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రచార రథాల ఈ విభాగంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇలా నాయకుల వరుసలంతా ఈ యాత్రలో యాక్టివ్గా ఉంటూ రాబోయే ఎన్నికల్లో తమకు టిక్కెట్ కన్ఫామ్ చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు