ఇనుప నాగలి గొంతులోకి దిగి.. యువకుడి మృతి

పొలం దున్నేందుకు వ్యవసాయ పరికరాలతో వెళ్తున్నట్రాక్టర్ ఢీకొని, ఇనుప నాగలి ఓ యువకుడి గొంతుకు బలంగా గుచ్చుకుపోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం జంక్షన్ లో చోటు చేసుకుంది.

తెలంగాణ సూర్యపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

బంధువులను కలిసి అత్తారింటికి వెళ్తున్న యువకుడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖమ్మం పట్టణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్ అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటికి వెళ్లాడు.

అక్కడి బంధువులను కలిసి రాత్రి అత్తగారింటికి వెళ్దామనుకున్నాడు.అత్తగారి ఊరైన సూర్యపేట జిల్లా ఆత్మకూర్ కు బైక్ బయలు దేరాడు.

పొలం పనులు ముగించుకుని ఓ ట్రాక్టర్ ఆత్మకూర్ మండలం బోట్యాతండా నుంచి తిర్మలాయపాలెం మండలం సోలిపురంకు వెళ్తుంది.ట్రాక్టర్ ఇంజిన్ కు మించి వెనుకవైపు పొడవైన ఇనుప నాగలి అడ్డంగా ఉంచారు.

Advertisement

రాత్రి కావడంతో ఎదురుగా వస్తున్న సంతోష్ కు చీకట్లో నాగలి కనబడకపోవడంతో నాగలి సంతోష్ గొంతులో దిగింది.కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో సంతోష్ అక్కడికక్కడే మరణించాడు.

ఎస్ఐ గోవర్ధన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నాడు.సంతోషం మరణవార్త విని అతని కుటంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగారు.

Advertisement

తాజా వార్తలు