ఏపీలో ఆ ప్రాంతంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి కృష్ణా జిల్లాలో అధిక రీతిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది అదే విధంగా ఈ ఏడాది సెకండ్ వేవ్ లో కూడా కరోనా వ్యాప్తి కృష్ణా జిల్లాలో అధికంగా ఉంది.

అధిక మోతాదులో కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి.పరిస్థితులు ఇలా ఉండగా కరోనా వైరస్ బారిన పడి తప్పించుకున్న వారు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ ఉన్నారు.

ఇతర రాష్ట్రాలలో ఈ కేసులు అధికంగా ఉన్నా కానీ ఏపీలో లేనట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీ లో అధిక సంఖ్యలో బయటపడుతూ ఉన్నాయి.

ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.దాదాపు 50 బ్లాక్ ఫంగస్ తో 50 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

విజయవాడలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుండడంతో.నగర వాసులు భయాందోళనలకి గురవుతున్నారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు