వర్షాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.ఈ మేరకు రేపు మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు.
దేశంలోకి రుతుపవనాల ప్రవేశించడంతో భారీ వర్షాలు, వరదలు పట్ల కేంద్రం అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలలో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవనున్నారని సమాచారం.
వర్షాలు వరదలు, తుపానుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు చర్చించనున్నారు.విపత్తు నిర్వహణ విభాగం, ఆయా రాష్ట్రాల అధికారులతో అమిత్ షా ప్రత్యేకం గా సమీక్షించనున్నారు.