అమెరికాలో ఘోర ఘటన.. మళ్లీ పేలిన తుపాకి తూటాలు.. ?

ప్రపంచదేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా లో రోజు రోజుకు మనుషులకు భద్రత తక్కువ అవుతుంది.

ఈ దేశంలో ఎవరి ప్రాణాలు, ఎవరి చేతిలో ఎందుకు పోతాయో చెప్పలేని పరిస్దితులు నెలకొంటున్నాయి.

ఇప్పటికే ఎన్నో సార్లు ఎందుకు చేస్తున్నారో తెలియకుండానే దుండగులు కాల్పులు జరిపిన ఘటనలు చోటు చేసుకున్నాయి.కాగా మరోసారి కూడా కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

ఓ దుండగుడు గురువారం టెక్సాస్‌లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినెట్ తయారీ పరిశ్రమలో కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని సమాచారం.అయితే కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు పారిపోయాడని, ఇతన్ని గ్రిమ్స్‌ కౌంటీలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ఇకపోతే ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడగా, ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడ్డారని వెల్లడించారు.అయితే నిందితుడు కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడు అనేది ఇంకా తెలియరాలేదట.

Advertisement
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

తాజా వార్తలు