విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉద్రిక్తత

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధి, నెలకొన్న అవినీతిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.

వైసీపీ మరియు టీడీపీ నేతలు పరస్పర సవాళ్లు చేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఇరు పక్షాలకు చెందిన నేతలు చర్చకు సిద్ధం అయ్యారు.

దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన నేతలను గృహ నిర్బంధం చేశారు.శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు.

అయితే చీపురుపల్లి అధికార పార్టీకి చెందిన నేత, మంత్రి బొత్స సొంత ఇలాఖా కావడంతో సవాళ్ల పర్వం ఆసక్తికరంగా మారింది.

Advertisement
మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!

తాజా వార్తలు