హైదరాబాద్ రాజ్‎భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ రాజ్‎భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.రాజ్‎భవన్ ఎదుట జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.

 Tension At Hyderabad Raj Bhavan-TeluguStop.com

గవర్నర్ తమిళిసై తమకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో రాజ్‎భవన్ వద్దకు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు మేయర్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన విషయం తెలిసిందే.

అయితే గవర్నర్ తమిళిసై వారిని కలిసేందుకు అనుమతి నిరాకరించారు.దీంతో గవర్నర్ పై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో రాజ్‎భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube