ఉలిక్కి పడిన టెన్నిస్ ప్రపంచం, జకోవిచ్ తో కలిసి ఆడిన గ్రిగర్ కు కరోనా!

టెన్నిస్ ప్రపంచం కి కూడా కరోనా రక్కసి తొంగిచూసింది.అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా టెన్నిస్ స్టార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.

టెన్నిస్ లో వరల్డ్ నంబర్ 19, ఇటీవల నంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ తో కలిసి డబుల్స్ ఆడిన గ్రిగర్ దిమిత్రోవ్ కు కరోనా పాజిటివ్ రావడంతో టెన్నిస్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లు అయ్యింది.గత వారం బెల్ గ్రేడ్ లో జరిగిన ఆడ్రియా టూర్ ఈవెంట్ లో జకోవిచ్, నిమిత్రోవ్ కలిసి డొమినిక్ థీయమ్, అలెగ్జాండర్ జ్వరేవ్ లను ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఎదుర్కొన్నారు.

అయితే ఆ మ్యాచ్ ముగిసిన తరువాత ఆయన మొనాకోకు వెళ్లిపోయారు.అయితే ఆ తరువాత అతడు అస్వస్థత పాలుకాగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని దిమిత్రోవ్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.గత కొన్ని రోజుల్లో తాను కలిసిన వారిలో ఎవరికో వైరస్ ఉందని,వారి వల్ల తనకు ఈ మహమ్మారి సోకినట్లు వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను.నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి.

ప్రస్తుతం నేను ఇంట్లోనే రికవరీ అవుతున్నాను.ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు.

దిమిత్రోవ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటుండగా, ఆడ్రియా టూర్ లో పాల్గొన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే దిమిత్రోవ్ తో కలిసి ఆడిన జకోవిచ్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోపక్క దిమిత్రోవ్ కు కరోనా సోకినట్టు తేలడంతో, ఆపై అతను పాల్గొనాల్సిన క్రొయేషియా అడ్రియాంటిక్ కోస్ట్ టోర్నీలు అన్నీ రద్దు అయినట్లు తెలుస్తుంది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు