గత రెండు దశాబ్దాలుగా నార్త్ ఇండియన్ హీరోయిన్స్ హవా ఎక్కువై పోయింది.ఇటీవల కాలంలో అయితే అది మరీ ఎక్కువగా కనిపిస్తుంది.
కొన్నేళ్ల క్రితం అయితే ఈ పరిస్థితి లేదు కేవలం మన తెలుగు హీరోయిన్స్ ఉండేవాళ్ళు/ మహా అయితే సౌత్ ఇండియన్ హీరోయిన్స్ మాత్రమే తెలుగు సినిమాల్లో నటించేవారు.కానీ ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
తెలుగు హీరోయిన్స్ మచ్చుకైనా లేకుండా పోయారు.ఇక్కడ వరకు కొంత వరకు బాగానే ఉన్నా అసలు ఒక్క హీరోయిన్ కూడా తెలుగు భాషను సరిగ్గా ఉచ్చరించలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఫ్లైట్ టికెట్ బుక్ చేయగానే హీరోయిన్ బాంబే నుంచి ఇంపోర్ట్ అయిపోవడం, ఇక హీరోతో కింద మీద పడి షెడ్యూల్ పూర్తి చేసుకోవడం, చెక్కు తీసుకొని ఇక్కడి నుంచి చెక్కేయడం ఇందుకు మాత్రమే హీరోయిన్స్ పనికొస్తున్నారు.వారు అలా వెళ్ళగానే ఇలా మరొక నటితో లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వారి పోర్షన్ డబ్బింగ్ చెప్పేసి సినిమాలు విడుదల చేసి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు.
అయితే ఆ హీరోయిన్ ఏం మాట్లాడిందో కూడా ఆమెకు తెలియదంటే నమ్మండి.ఎందుకంటే వారికి ప్రామ్ప్టింగ్ చెప్తే సరిపోతుంది అది ఏ భాష, ఏ పదం, ఎలాంటి పదాన్ని ఉచ్చరిస్తున్నామన్న విషయం పూర్తిగా తెలిసే అవకాశమే లేదు.
అయితే ఇది అందరికీ వర్తించదు.ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న కొంతమంది హీరోయిన్స్ ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు వారిలో రష్మిక, సాయి పల్లవి, నిత్యామీనన్, సమంత లాంటి హీరోయిన్స్ ఉన్నారు.
రష్మిక
ఎన్ని సినిమాల్లో నటిస్తుందో తానే తెలియనంత బిజీగా ఉన్న రష్మిక ప్రస్తుతం తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇష్టపడుతోంది.ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది ఏ భాషలో నటిస్తున్న ఆ భాషకు సంబంధించి రోజు సాయంత్రం పూట ఒక గంట ట్రైనింగ్ తీసుకుంటాను అంటూ సంచలన విషయం బయట పెట్టింది.అంతేకాదు ఆమె మాట్లాడుతున్న కూడా తెలుగులో కొన్ని స్పష్టమైన పదాలను కూడా బాగా పలుకుతోంది.తెలుగువారు సైతం ఉచ్చరించలేని కొన్ని పదాలు రష్మిక నోటి వెంట బాగా రావడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయం.ఇలా రష్మిక డబ్బింగ్ కోసం ప్రాణం పెట్టి చేయడం కూడా నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
సాయి పల్లవి
మొదటి సినిమా నుంచి తన ప్రతి పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది సాయి పల్లవి.కానీ ఇప్పటికీ భాష మీద పట్టు సాధించలేదు.నటించిన అన్ని తెలుగు సినిమాల్లో తంటాలు పడి డబ్బింగ్ అయితే పూర్తి చేసింది కానీ ప్రమోషన్స్ విషయంలోనే ఇటీవల కాలంలో ఏదో ఒకటి మాట్లాడపోయి మరేదో మాట్లాడి చిక్కుల్లో ఇరుక్కుపోయి కేసులు పాలైంది.
అలా తనకు తెలుగు ఇంకా అర్థం అవ్వలేదు కానీ మాట్లాడటానికి అయితే గట్టిగానే ప్రయత్నం చేస్తుంది.అంతే కాదు ప్రతి పాత్ర కోసం తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.అందుకోసం తను చాలా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది
నిత్య మీనన్
తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకునే మరొక నటీమణుల్లో నిత్యామీనన్ కూడా ఉంది.అక్కడక్కడ మాట్లాడానికి ఇప్పటికీ తడబడుతున్న కూడా తెలుగు మాట్లాడానికి బాగానే ప్రయత్నిస్తుంది.కానీ ఆమెకు సరైన డిమాండ్ కానీ ఆమె చేతిలో సినిమాలు కాని లేవు.పుట్టి,పెరిగింది అంతా కూడా బెంగుళూరు లోనే .కానీ మలయాళ కుటుంబంలో నిత్యామీనన్ జన్మించింది.
సమంత
ఈ అక్కినేని మాజీ కోడలు సైతం తెలుగు బాగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమెకు తెలుగు సినిమాల్లో పాపులారిటీ లేకుండా పోయింది.ఈమె తండ్రి తెలుగువారే కాగా తల్లి మాత్రం మలయాళీ.తమిళనాడు రాజధాని అయిన చెన్నై పుట్టి, క్రిస్టియన్ గా పెరిగింది.అయినా సరే బాగానే ప్రయత్నించి ఇటీవల కాలంలో డబ్బింగ్ తానే పూర్తి చేస్తుంది.