రిలాక్స్ అవుతున్న హీరోలు.. అభిమానులకు నిరీక్షణ తప్పదా?

నిన్నటి వరకు షూటింగులు ప్రమోషన్స్ అంటు బిజీబిజీగా గడిపిన స్టార్ హీరోలు ఇక ఇప్పుడు మాత్రం రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.

ఎందుకంటే సూపర్ హిట్ అందుకున్నాడు హీరోలు కొత్త సినిమా మొదలు పెట్టడానికి మాత్రం కాస్త ఆలస్యం చేస్తున్నారు అని అర్థమవుతుంది.

ఆ ముగ్గురు హీరోలు ఎవరో కాదు మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి 2 మంత్స్ దాటిపోయింది.

అయినా ఎన్టీఆర్ మరో సినిమా షూటింగ్ ప్రారంభించలేదు.సర్కార్ వారి పాట వచ్చి వన్ మంత్ అయిపోయింది.

అయినా మహేష్ బాబు ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నాడు.ఇక పుష్ప సినిమా విడుదలై ఆరు నెలలు దాటిపోయింది.

Advertisement

అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా తొందర పడటం లేదు అని తెలుస్తుంది.అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ హీరో సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

సర్కారు వారి పాట రిలీజ్ అయిపోయాక మహేష్ బాబు వెంటనే త్రివిక్రమ్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్తారని అనుకున్నారు అందరు.ఈ సినిమా ముహూర్తం అయిపోయింది.

క్యాస్టింగ్ అందరూ ఫిక్సయ్యారు.కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కావడం లేదు.

మరోవైపు గత ఏడాది డిసెంబర్ 17న పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.ఇక పుష్పా 2 కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్.పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అయితే ఆరు నెలలు గడిచినా ఇంకా పుష్ప 2 అప్డేట్ రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.త్రిబుల్ ఆర్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుంది అనుకున్నారు.

Advertisement

కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు