కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీ తోనైనా ఈ ఆంటీలకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలంట...

ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ ఉంటుందో లేదో అనే సందేహం మొన్నటి వరకు బిగ్ బాస్ అభిమానులని కుదిపేసింది.

దీంతో ఈ షో నిర్వాహకులు అభిమానుల అనుమానాలన్నీ పటా పంచలు చేస్తూ ఆదివారం రోజున షో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఏడాది కంటెస్టెంట్ల విషయంలో కొంతమేర షో నిర్వాహకులు సడలింపులు చేపట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.దీనికితోడు కరోనా వైరస్ కారణంగా స్టార్ సెలబ్రెటీలు ఎవరూ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపక పోవడంతో పెద్దగా ఫేమ్ లేనటువంటి వారిని బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లగా ఎంచుకున్నారని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా  వినిపిస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నాలుగవ సీజన్ ప్రారంభం కాకముందు మొదట్లో ఈ షోలో టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న నటి సురేఖ వాణి, ప్రగతి తదితరులు పాల్గొంటున్నట్లు పలు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ బిగ్ బాస్ షో ప్రారంభమైన తర్వాత ఈ ఇద్దరూ పాల్గొనడం లేదని తెలియడంతో ఇద్దరు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

దీంతో కొందరు అభిమానులు కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీ తోనైనా ఈ ఇద్దరికీ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో షో నిర్వాహకులకు రిక్వెస్ట్  చేస్తున్నారు. మరి షో నిర్వాహకులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాలలో మీమ్స్, ట్రోల్స్ హంగామా షురూ అయింది.అంతేగాక అప్పుడే కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల పేరుతో ఆర్మీలు క్రియేట్ చేసి తమ అభిమాన కంటెస్టెంట్లను సపోర్ట్ చెయ్యాలంటూ కోరుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు