అమెరికాలో మరణించిన తెలంగాణ యువకుడు..!!

అమెరికా దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు మరణించడం జరిగింది.

మృతుని వివరాలు బట్టి చూస్తే వికారాబాదు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక గంగారం కాలనీకి చెందిన ఆది వినోద్ కుమార్-హిమజ్యోతి దంపతుల కుమారుడైన నిఖిల్ ఏడేళ్ల కిందట అమెరికా వెళ్లారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో సాఫ్టువేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అక్కడే ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో పది రోజుల కిందట నిఖిల్ ప్రయాణిస్తున్న కారు వెళ్తున్న సమయంలో మరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలు నిఖిల్ కావడంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.

గత పది రోజుల నుండి చికిత్స తీసుకుంటూ ఉన్న నిఖిల్ ఇటీవల మరణించటంతో గురువారం అతని మృతదేహం వికారాబాద్ కి చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రులు ఇక్కడే ఉండటంతో కొడుకు చనిపోయిన వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు