ఆయన్ని కలుసుకుంది ... పని అయిపొయింది

ఆయన అంటే ఎవరు? కలుసుకున్నది ఎవరు? ఆయన అంటే తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్.

కలుసుకున్న నాయకురాలు ప్రస్తుత టీడీపీ ఎంపీ (రాజ్య సభ) గుండు సుధా రాణి.

ఆమె గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి.వరంగల్ నాయకురాలైన సుధా రాణి గులాబీ పార్టీలో చేరడం లేదని నిన్న కూడా టీడీపీ నాయకులు అన్నారు.

కాని ఆమె అంతా సెట్ చేసుకుంది.రేపే ముహూర్తం కాబట్టి ఈ రోజు కేసీఆర్ను కలుసుకొని గ్రీన్ సిగ్నల్ తీసుకుంది.

ఫిరాయింపు విషయం గురించి విలేకరులు అడిగినప్పుడు తొందర ఎందుకు? వెయిట్ అండ్ సి అని చెప్పింది.అలా చెప్పింది అంటే పని అయిపోయినట్లే కదా.మిషన్ కాకతీయ చాలా గొప్పదని, వాటర్ గ్రిడ్ పథకం తనకు ఇష్టమని చెప్పింది.కాబట్టి ఫిరాయింపు ఖాయం అయింది.

Advertisement

టీడీపీ అధినేత ఈ విషయం లైటుగా తీసుకున్నారు.పొతే పోనీ .నష్టం లేదు అన్నారు.మరి గుండు సుధా రాణికి కెసీఆర్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.

' హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ 
Advertisement

తాజా వార్తలు