గ్రూప్ -3, 4 పరీక్షలపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

తెలంగాణలో గ్రూప్ -3 మరియు గ్రూప్-4 పరీక్షలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది.

ఈ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

గ్రూప్ -3 మరియు గ్రూప్ -4 లో టైపిస్టుతో పాటు అసిస్టెంట్ పోస్టులు తొలగించారని ఆరోపిస్తూ సుమారు 101 మంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ క్రమంలో ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు