ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.మహేశ్ బ్యాంక్ కేసులో ఆదేశాలు పాటించలేదని నోటీసులు ఇచ్చింది.

పాలన వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఆర్బీఐ ఆదేశాలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వాటాదారులు కోర్టుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో జూలై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆర్బీఐకి ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు