ఈడీ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ అధికారులు ఎదుట హాజరైయ్యారు.ఈ క్రమంలో ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.

 Telangana Congress Working President Anjan Kumar For Ed Investigation-TeluguStop.com

నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా అంజన్ కుమార్ ను ఈడీ విచారించనుంది.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు.

పి ఎం ఎల్ ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఆయనను ప్రశ్నించనుంది.గత నెల 3వ తేదీనే అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.

అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారన్న విషయం తెలిసిందే.కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube