రీజన్ ఏంటో : కేసీఆర్ ఏపీ పర్యటన రద్దు !

ఏపీలో ఫిబ్రవరి 14 వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని అంతా భావించారు.ఈ రోజు వరకు ఆ పర్యటనకు సంబంధించి మీడియా కథనాలు వస్తూనే ఉన్నాయి.

14వ తేదీన వైసీపీ అధినేత జగన్ గృహప్రవేశం ఉండడం.అలాగే విశాఖ శారదా పీఠం లో నిర్వహించనున్న రాజశ్యామల యాగానికి కెసిఆర్ హాజరు కావాల్సి ఉంది.

అయితే కారణమేంటో తెలియదుగానీ.అకస్మాత్తుగా కేసీఆర్ పర్యటన రద్దయింది.

కేసీఆర్ తరపున రాజశ్యామల యాగానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు సమాచారం.అయితే ఈ పర్యటన రద్దు కావడానికి వైసీపీ అధినేత జగన్ గృహప్రవేశం వాయిదా పడడమే కారణమా ఊహాగానాలు కూడా బయలుదేరాయి.జగన్ తన సోదరి అనార్యోగం కారణంగా గృహప్రవేశాన్నిజగన్ వాయిదా వేసుకున్నారు.

Advertisement
మాచర్లకు వెళ్ళకూడదు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు ఆదేశాలు..!!
Advertisement

తాజా వార్తలు