టీడీపీ పార్టీలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు( Nimmala Ramanaidu ) తీరు చాలా విభిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.వైసీపీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలలో చాలా విభిన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు.
అదేవిధంగా తన నియోజకవర్గ ప్రజల సమస్యల విషయంలో ఎటువంటి సమయంలోనైనా స్పందించే ప్రజానేత.ఇదిలా ఉంటే నియోజకవర్గంలో నిర్వహించిన “ఇదేం కర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.
ముఖ్యమంత్రి జగన్ వద్ద రెండు బటన్ లు ఉంటాయని అన్నారు.
ఒకటి పది రూపాయలు ప్రజలకు వేయటానికి, మరొకటి ₹100 ప్రజల నుంచి తీసుకోవడానికి అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
ఎలమంచిలి మండలం చించినాడలో నిర్వహించిన “ఇదేం కర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో ఇంటింటికి తిరిగారు.ఈ సందర్భంగా వైసీపీ( Ycp ) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు భావించి మోసపోయారు.రాజధాని లేక ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి అని అన్నారు.రేట్లు పెంచేయడం వంటి విషయాలపై.సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.