అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ను కలిసిన టీడీపీ నేతలు.సీఈవో ను కలిసిన అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, ఇతర నేతలు.
రాష్ట్రములో ఓట్ల గల్లంతు,నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసిన టీడీపీ బృందం.అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు.
దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు.
ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నప్పటికీ కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.రాప్తాడు లో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసినా అనంతపురం కలెక్టర్ పట్టించుకోలేదు.
కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు,పోలింగ్ స్టేషన్ల మార్పు ఈసీ ఆదేశాల ప్రకారం జరగాలి.ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు వంటి 17 నియోజకవర్గాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి.
ఫారం -6,ఫారం -7 విషయంలో నోటీసులు ఇవ్వకుండా మార్పులు చేస్తే బీఎల్ఓ లను బాద్యులు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు.తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సీస్పష్టత ఇచ్చారు.8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పనిచేస్తున్నారు.శ్రీకాకుళం,కోనసీమ,బాపట్ల,గుంటూరు,నెల్లూరు,అన్నమయ్య,తిరుపతి,అనంతపురం జిల్లాల కలెక్టర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు.
పయ్యావుల కేశవ్,టీడీపీ ఎమ్మెల్యే.బీఎల్ఓ వేరిఫికేషన్ లేకుండానే ఒకేసారి భారీగా ఓట్లు తొలగిస్తున్నారు.
ఎమ్మార్వో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఓట్లు తొలగిస్తున్నారు.తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారు.







