నారా లోకేష్ పాదయాత్ర.. సంతోషంలో వైసీపీ!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని నారా లోకేష్ గట్టి ప్రయాత్నాలే చేస్తున్నారు.ఇందుకోసం ఆయన మిషన్‌ పాదయాత్ర చేపట్టారు.

ఈ ప్రకటన చూసి వైసీపీ నేతలు భయపడి అలర్ట్ అవ్వాల్సిందే పోయి.అధికార పార్టీ నేతలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే, లోకేష్ ప్రజలతో మమేకమైమవుతున్న సమయంలో, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుని నవ్వులపాలవుతాడని వారు గట్టిగా నమ్ముతున్నారు.భాషలో, భావవ్యక్తీకరణలో అనేక తప్పులతో కుంటి ప్రసంగాల వల్ల ఇప్పటికే వందల కొద్దీ ట్రోలింగ్‌లు ఎదుర్కొన్నాడు.

ట్రోలర్లు రోజుకో విధంగా ట్రోల్ చేయడానికి.ప్రజలకు వినోదం పంచేందుకు మంచి అవకాశం ఇస్తున్నారని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అలాగే లోకేష్ పాదయాత్రపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు.పాదయాత్రలో లోకేష్ ఎక్కడ అనవరసంగా నోరు జారుతాడో అది చివరికి టీడీపీకి మైనస్‌గా మారుతుందని భయపడుతున్నారు.

లోకేష్ బదులుగా బాలయ్య పాదయాత్ర కనుక చేస్తే ఆ ఊపే వేరుగా ఉంటుందిని టీడీపీ నేతలు భావిస్తున్నారు.క్రౌడ్ పులింగ్ చేయగలడని, బాలకృష్ట మాట్లాడకపోయిన ఆయన పాదయాత్రపై మీడియాకు కూడా హైలెట్ చేస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.బాలయ్య పాదయాత్ర కాకపోయిన కనీసం బస్సు యాత్ర మెుదలుపెట్టిన బాగుంటుందని టీడీపీ భావిస్తుంది.

ఎన్టీయార్ తరహాలో చైతన్య రధం లాంటి వాహనంలో ఏపీ మెుత్తం తిరిగితే బాగానే ప్రభంజనం సృష్టించవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట.అయితే బాలయ్య పాదయాత్రకు చంద్రబాబు ఓకే అంటారో లేదనది చూడాలి.తన కుమారుడు లోకేష్ తప్ప టీడీపీలో ఎవరి హవా కూడా ఉండకూడదని గిరిగీసుకుని కూర్చున్న చంద్రబాబు బావమరిది బాలయ్య యాత్రకు ఓకే అంటారో లేదో తెలియదు.ఆయన్ని పక్కన పెట్టేసి కొడుకునే జనంలోకి పంపాలనుకుంటున్నారు చంద్రబాబు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు