అభిరామ్‌తో చేయాలనుకున్నది రానాతో

దగ్గుబాటి ఫ్యామిలీకి టాలీవుడ్‌లో మంచి పేరుంది.కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన రామానాయుడు వారసులుగా సురేష్‌బాబు, వెంకటేష్‌లు ఇండస్ట్రీలో గౌరవంగా ముందుకు సాగుతున్నారు.

హీరో వెంకటేష్‌ విషయాన్ని పక్కకు పెడితే నిర్మాత సురేష్‌బాబు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అన్నట్లుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇలాంటి సమయంలో ఆయన చిన్న కొడుకు అభిరామ్‌ విషయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన పరువు తీశాయి.

ఎంతో కాపాడుకుంటూ వస్తున్న పరువు, ప్రతిష్టలను శ్రీరెడ్డి రెండు ఫొటోలు విడుదల చేసి గంగ పాలు చేసిందనే ఆవేదన సురేష్‌బాబులో ఆ మద్య వ్యక్తం అయ్యింది.హీరో అవ్వాలని ఉవ్విల్లూరిన అభిరామ్‌ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు.

శ్రీరెడ్డి ఎఫెక్ట్‌తో కొన్నాళ్లుగా కనీసం కనిపించడం కూడా మానేసిన అభిరామ్‌ ఇక సినిమాల్లోకి ఏం వస్తాడు చెప్పండి.ఈ సంవత్సరం అభిరామ్‌ హీరోగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని సురేష్‌బాబు భావించాడు.అందుకోసం కొన్ని నెలల క్రితమే ఒక స్క్రిప్ట్‌ను కూడా అనుకున్నారు.

Advertisement

అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.ఆ చిత్రాన్ని ఇప్పుడు అభిరామ్‌తో చేసే పరిస్థితి లేదు.

కొన్నాళ్ల వరకు అభిరామ్‌ బయటకు వచ్చేందుకు సురేష్‌బాబు నో చెబుతున్నాడు.దాంతో ఆ ప్రాజెక్ట్‌ను రానాతో చేసేందుకు రంగం సిద్దం అయ్యింది.

తమ్ముడు చేయాల్సిన ప్రాజెక్ట్‌ను అన్న రానా చేసేందుకు ముందుకు వస్తున్నాడు.‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ తన మూడవ సినిమాను రానాతో చేయబోతున్నాడు.

అభిరామ్‌ కోసం సిద్దం చేసుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది చిత్రంను విడుదల చేసే పనిలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

ఆ చిత్రం విడుదలైన తర్వాత రానాతో సినిమాను తరుణ్‌ భాస్కర్‌ ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.అభిరామ్‌ సినీ కెరీర్‌ ప్రారంభంకు ముందే నాశనం అయ్యిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

రామానాయుడుకు చాలా ఇష్టమైన మనవడిగా పేరు తెచ్చుకున్న అభిరామ్‌ మరీ ఇలా అవ్వడం దారుణం అంటూ ఆ కుటుంబంను అభిమానించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అభిరామ్‌ కెరీర్‌ను నాశనం చేసిన శ్రీరెడ్డిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం, ఈ విషయం అంతా కూడా సర్దుమనిగిన తర్వాత అభిరామ్‌ను మళ్లీ హీరోగా పరిచయం చేయాని సురేష్‌బాబు ప్లాన్‌ చేస్తున్నాడు.2020 వరకు అభిరామ్‌తో సినిమాను చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.అప్పటి వరకు శ్రీరెడ్డి, అభిరామ్‌ల విషయంను ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

తాజా వార్తలు