కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే క్లారిటీ ఇచ్చిన తారక్

ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని తారక్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.

యువశుధ బ్యానర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీతెరకెక్కబోతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆచార్య మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత తారక్ మూవీని కొరటాల సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.జులైలో ఈ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఇప్పటికే కొరటాల భరత్ అనే నేను సినిమాలో కియరా అద్వానీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ నేపధ్యంలో తారక్ కోసం ఆమెనే తీసుకోవాలని భావిస్తున్నట్లు బోగట్టా.ఇదిలా ఉంటే కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడుతో సినిమా చేస్తాడనేదానిపై తాజాగా తారక్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ లో ఉన్నారు.అలాగే కేజీఎఫ్ 2 మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.

అలాగే సలార్ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ మూవీని స్టార్ట్ చేస్తాడు.ప్రస్తుతం ఎలాగూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ కారణంగా ఇంటివద్దనే ఉండటంతో ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.ఇక తారక్ ని ఇప్పటి వరకు ఎవరూ ప్రెజెంట్ చేయని విధంగా సరికొత్త క్యారెక్టరైజేషన్ లో ప్రశాంత్ నీల్ తన సినిమాలో చూపించబోతున్నాడని తెలుస్తుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లో ఉన్న తారక్ ఇంగ్లీష్ డైలీతో ఫోన్ లో మాట్లాడి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ విషయాన్ని రివీల్ చేశారు.అలాగే ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరాం భీమ్ పాత్ర కోసం ఏకంగా 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నట్లు కూడా తారక్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు