విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తెప్పోత్సవంపై సస్పెన్స్ కొనసాగుతోంది.దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది అమ్మవారికి కృష్ణానదిలో నదీ విహరం, తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే, తాజాగా కృష్ణానదిలో భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది.పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
అయితే, నదిలో 30 వేల క్యూసెక్కులలోపు నీరు ఉంటేనే ఇరిగేషన్ శాఖ అధికారులు జల విహారానికి అనుమతి ఇస్తారు.వారు నిరంభ్యంతరకర ఇస్తేనే తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం జలవిహారంపై అధికారులతో ఉత్సవ కమిటీ భేటీ అవుతారు.సమావేశం అనంతరం తెప్పోత్సవంపై తుది నిర్ణయానికి రానున్నారు.