టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల కీర్తి సురేష్ ఒక వ్యక్తితో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక అప్పటి ఆమె ప్రేమలో పడింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు అని కీర్తి సురేష్ తెలిపిన విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నీ కూడా ఒట్టి పుకార్లే అని తేల్చి చెప్పేసింది.

ఇది ఇలా ఉంటే ఈ వార్తలపై తాజాగా, కీర్తి సురేష్ తండ్రి సురేష్( Suresh ) కూడా స్పందించారు.ఈ మేరకు కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియో లో ఈ విధంగా చెప్పుకొచ్చారు.నా కూతురు కీర్తి ఒక అబ్బాయితో లవ్లో ఉందని.త్వరలో అతడ్ని పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
అవన్నీ ఫేక్ న్యూస్.

నాకు ఆ అబ్బాయి తెలుసు.అతడి పేరు ఫర్హాన్.( Farhaan ) అతడు మా కుటుంబ స్నేహితుడు.
ఫర్హాన్ పుట్టిన రోజున కీర్తి కొన్ని ఫొటోలను షేర్ చేసింది.వాటిని చూసి మీడియా తప్పుడు వార్తలు రాసింది.
కీర్తి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందే చెప్తాము.తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు.
అలాంటి వార్తల కారణంగా మా కుటుంబంలో మనఃశాంతి కరువైంది అంటూ అసహనం వ్యక్తం చేశారు.ఇకపోతే కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్.
ఈ సినిమాలో నాని హీరోగా నటించిన విషయం తెలిసిందే.







