దగ్గుబాటి మల్టీ స్టారర్ బాధ్యతలు సతీష్ వేగేశ్నకి

టాలీవుడ్ లో ఫ్యామిలీ మూవీగా అక్కినేని వారికి మనం మరిచిపోలేని జ్ఞాపకం మిగిల్చింది.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

అక్కినేని ఫ్యామిలీ హీరోలైన మూడు తరాల నటులు అందులో నటించారు.ఇక అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత కూడా నటించింది.

ఈ నేపధ్యంలో వారికి ఆ సినిమా ఎప్పటికి స్పెషల్ మూవీ అని చెప్పాలి.ఇదిలా ఉంటే ఇదే తరహాలో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

దీనిపై నిర్మాత సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చాడు.ఒకవేళ ఈ సినిమా సెట్ అయితే అందులో అతను కూడా ఏదో ఒక పాత్రలో మొదటిసారిగా తెరపై కనిపించేందుకు ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది.

Advertisement

దగ్గుబాటి ఫ్యామిలీ వారసత్వం ఉన్న నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది.అలాగే సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా నటించే అవకాశం ఉంది.

ఇక తాజాగా సురేష్ బాబు మరో సారి తమ ఫ్యామిలీ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు.ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు చేసిన దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పకనే చెప్పేశాడు.

రీసెంట్ గా సతీష్ ఓ మంచి ఫ్యామిలీ స్టోరీని నేరేట్ చేశాడని, కథ అద్భుతంగా ఉందని ఇప్పుడు దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్ గా మార్చే పనిలో అతను ఉన్నాడని సురేష్ బాబు చెప్పాడు.సతీష్ వేగేశ్నకి ఫ్యామిలీ ఎమోషన్స్ ని డీల్ చేసి సినిమాలు తీయడంలో మంచి టాలెంట్ ఉందని, అతని ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ హీర లతో ఆ సినిమా ఉంటుందని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు