టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ నరేష్-పవిత్రా లోకేష్( Naresh Pavitra Lokesh ) రిలేషన్షిప్లో ఉన్నారు .వీరు తాజాగా మళ్లీ పెళ్లి( Malli Pelli Movie ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .
అలాగే వీరు పెళ్లి చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి .ఇక వీరి పెళ్లిపై తాజాగా నటి సురేఖ వాణి( Surekha Vani ) తనదైన శైలిలో స్పందించారు .సురేఖ వాణి సైతం కొంత కాలంగా సామజిక మాధ్యమాల్లో చెలెరిగిపోతున్నారు .తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ చేసే హంగామా అంతా ఇంతా కాదు.తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇక కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు.
మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత తమదైన రీతిలో కౌంటర్ ఇస్తూ ఉంటారు .సురేఖ వాణి తరచుగా గ్లామర్ రీల్స్ తో పాటు సెటైరికల్ రీల్స్ చేయడం, అవి వైరల్ కావడం చూస్తున్నాం.ఇటీవల సురేఖ వాణి. వైయస్ షర్మిల ని ట్రోల్ చేస్తూ పెట్టిన ఇంస్టాగ్రామ్ రీల్స్ పెద్ద దుమారమే రేపాయి.కొంతమంది షర్మిలపై చేసిన రీల్స్ ఫన్నీగా ఉన్నాయి అని కామెంట్ పెడితే.మరికొంత మంది తిరిగి సురేఖ వాణిని ట్రోల్ చేశారు.
తాజాగా సురేఖ వాణి మరో వీడియో పోస్ట్ చేశారు .ఈ వీడియోలో సురేఖ వాణి నరేష్, పవిత్రలని. రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ విద్యార్థిని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసింది.ముసలోళ్ళందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి.నాకు కావడం లేదు ఏంటి అంటూ వాపోయారు .నరేష్, పవిత్రల మళ్ళీ పెళ్లి చిత్రం ఈ శుక్రవారమే విడుదలయింది అలాగే 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి కూడా రెండో వివాహం చేసుకున్నారు.
వాళ్లందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయి.నాకు కావడం లేదు ఏంటి అని సురేఖ వాణి పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు .సురేఖ వాణి భర్త ఆ మరణించారు.అప్పటి నుంచి సురేఖ వాణి సింగిల్ గా ఉంటోంది.
మా అమ్మకి మళ్ళి పెళ్లి చేస్తానని సుప్రీతా ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడ చేశారు .అయితే సురేఖ వాణి రీసెంట్ పోస్ట్ చూస్తుంటే ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ కోసం పరితపిస్తోంది అని స్పష్టం అవుతుంది .మరి ఆమె పెళ్లి ఎప్పుడు అవుతుందో చూడాలి .