సుహాసిని పిచ్చి ఆరోపణలు

ప్రస్తుత కాలంలో వెబ్‌ మీడియా చాలా పవర్‌ ఫుల్‌ అయ్యింది.ముఖ్యంగా సినిమా రంగంకు చెందిన వార్తలను ఎప్పటికప్పుడు వ్యూవర్స్‌ ముందు వెబ్‌ సైట్లు ఉంచుతున్నాయి.

ఇక సినిమా ఏదైనా కొత్తది వస్తే ఆ సినిమా లోటు పాట్లతో పాటు మంచి చెడులను రివ్యూల ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు.అలాంటి రివ్యూవర్స్‌పై తాజాగా నిన్నటి తరం హీరోయిన్‌ సుహాసిని, మణిరత్నం భార్య విమర్శలు చేసింది.

ఏం తెలియని వారు రివ్యూలు రాస్తున్నారు అంటూ ఎద్దేవ చేసింది.ఒక సినిమాకు రివ్యూ రాసేందుకు అర్హత కావాలని, కంప్యూటర్‌ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా రివ్యూవర్స్‌ అవుతున్నారంటూ సుహాసిని పిచ్చి ఆరోపణలు చేసింది.

రివ్యూలు రాసేందుకు ఒక అర్హత ఉండాలని, తప్పకుండా వారు సర్టిఫైడ్‌ అయిన వారై ఉండాలని సుహాసిని అంటోంది.అయితే సుహాసిని చేస్తున్న పిచ్చి ఆరోపణలను వెబ్‌ రిపోటర్లు తప్పుబడుతున్నారు.

Advertisement

మీకేం అర్హత ఉంది అంటూ నటిస్తున్నారు, మీరు సినిమాకు పలు విభాగాల్లో పని చేశారు.ఏ అర్హత ఉందో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

త్వరలో సుహాసిని భర్త మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమా విడుదల నేపథ్యంలో సుహాసిని రివ్యూవర్స్‌పై పై విధంగా విమర్శలు చేసింది.

Advertisement

తాజా వార్తలు