అలాంటివారు గురువుగా నటిస్తుంటారు... వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్!

బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు ఈయన ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక బండ్ల గణేష్ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ విషయం గురించి తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెబుతూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.తనని దైవంగా భావిస్తూ ఆ దైవానికి తాను భక్తుడిగా ఉంటానని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ జపం చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.

తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.అయితే ఈయన చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈయన చేసిన ఈ ట్వీట్ చూసినటువంటి నేటిజన్స్ బండ్ల గణేష్ కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు.

పవన్ విషయంలో త్రివిక్రమ్ బండ్ల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉన్న విషయం మనకు తెలిసిందే.దీంతో ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేశారని తెలుస్తోంది.

Advertisement

బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మోసం చేయాలనుకునేవారు మేధావిలా.వంచించాలనుకునేవాడు గురువుగా నటిస్తారు.కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ భక్తుడిగా పొగరుగా ఉంటాడు అది మీకు నచ్చిన నచ్చకపోయినా అంటూ ట్వీట్ చేశారు.

దీంతో ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బండ్ల గణేష్ తప్పనిసరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారు అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక వీరిద్దరి మధ్య భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో బండ్ల త్రివిక్రమ్ ను టార్గెట్ చేశారంటూ పలువురు భావిస్తున్నారు.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు