బాలయ్యతో ఒట్టు వేయించుకున్న భార్య వసుంధర.. అలా చేయకూడదని?

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్‌ లు   వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

అఘోర పాత్రలో బాలకృష్ణ అద్బుతంగా నటించారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇతర టాక్ షోలతో పోలిస్తే ఈ టాక్ షో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది.తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు బాలయ్య, అనిల్ రావిపూడి హాజరై సందడి చేశారు.

బాలయ్య ఈ షోలో తన భార్య ఒట్టు వేయించుకుని సినిమాకు తీసుకొనివెళ్లే విషయం గురించి చెప్పుకొచ్చారు.తనకు సినిమా నచ్చకపోతే సినిమా మధ్యలో వెళ్లిపోవడం, పాటలు వచ్చే సమయంలో నిద్రపోవడం చేస్తానని అలా చేయడం భార్య వసుంధరకు నచ్చదని బాలకృష్ణ అన్నారు.

Advertisement

అయితే పాటలు వచ్చిన సమయంలో నిద్రపోకుండా ఉండాలని, సినిమా మధ్యలో వెళ్లకూడదని భార్య తనతో ఒట్టు వేయించుకున్నారని బాలకృష్ణ వెల్లడించారు.

అన్ స్టాపబుల్ షోకు ఎవరు వచ్చినా ఆయా సెలబ్రిటీల మద్యం బ్రాండ్ గురించి బాలయ్య అడుగుతారనే విషయం తెలిసిందే.అయితే బ్రహ్మానందం, అనిల్ రావిపూడిని మాత్రం మద్యం బ్రాండ్ కు సంబంధించి బాలయ్య అడగలేదు.

ఈ షో ద్వారా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.ఈ షోలో బ్రహ్మానందంను ఎన్టీఆర్ ఏఎన్నార్ లలో ఎవరంటే ఇష్టమని బాలయ్య అడిగారు.ఆ తర్వాత ఏఎన్నార్ ఇష్టమని బ్రహ్మానందం చెప్పినట్టు తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని బాలయ్య వెల్లడించారు.

అయితే బ్రహ్మానందం మాత్రం ఇద్దరూ రెండు కళ్లు అని చెప్పుకొచ్చారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు