కేసు బ్రతికే ఉంది.. పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను.. శ్రీసుధ షాకింగ్ కామెంట్స్!

తక్కువ సినిమాలే చేసినా పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో శ్రీసుధ ఒకరు.అర్జున్ రెడ్డి సినిమా వల్ల శ్రీసుధకు పాపులారిటీ మరింత పెరిగింది.

అయితే కొన్ని నెలల క్రితం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై శ్రీసుధ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.శ్యామ్ కె .నాయుడు తనతో ఐదు సంవత్సరాల పాటు సహజీవనం చేశాడని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత మాట మార్చాడని శ్రీసుధ ఆరోపణలు చేశారు.పోలీసులకు శ్యామ్ కె.నాయుడుపై శ్రీసుధ ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది.అయితే శ్యామ్ కె నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

శ్రీసుధ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.ఈ విషయం గురించి శ్రీసుధ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేసు ఇంకా బ్రతికే ఉందని చెప్పుకొచ్చారు.

శ్యామ్ కె .నాయుడుకు బెయిల్ రద్దై కోర్టులో మాత్రమే ఊరట పొందారని శ్యామ్ కె.నాయుడు తనకు అన్యాయం చేశాడని ఆ అన్యాయం విషయంలో పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు.తర్వాత రోజుల్లో ఎదురయ్యే సెషన్స్ కు శ్యామ్ కె .నాయుడు సిద్ధంగా ఉండాలని శ్రీసుధ చెప్పుకొచ్చారు.ఈ కేసును వదిలిపెట్టే ఆలోచన మాత్రం లేదని శ్రీసుధ చెప్పకనే చెప్పేశారు.

Advertisement

శ్యామ్ కె.నాయుడు వల్లే తాను అప్పులపాలయ్యానని శ్రీసుధ పేర్కొన్నారు.శ్యామ్ కె.నాయుడు భార్య కూడా తనపై దాడికి పాల్పడ్డారని ఆమె గతంలో చెప్పు కొచ్చారు.ఎక్కువ మొత్తంలో డబ్బును ఆశ చూపి కేసును సెటిల్ చేసే ప్రయత్నం చేశారని శ్యామ్ కె .నాయుడు వెల్లడించారు.శ్రీసుధ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు