తెలుగు సినీ పరిశ్రమ నటి శ్రీరెడ్డి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.అంతేకాకుండా ప్రేక్షకులకు కూడా శ్రీ రెడ్డి తో పరిచయం బాగానే ఉంది.
ఈ బ్యూటీ ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వివాదంతో ఓ రేంజ్ లో వార్తలకెక్కింది.ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతూ రోజు రోజుకి తన అందాలతో, తన లో దుస్తులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను నిద్ర లేకుండా చేస్తుంది.
ఇదిలా ఉంటే శ్రీ రెడ్డి తాజాగా నటించిన సినిమాకి సెన్సార్ బోర్డు ఓకే చేసిందట.
శ్రీ రెడ్డి భవాని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘క్లైమాక్స్’ సినిమాల్లో నటించింది.
ఈ సినిమా లో తన లైఫ్కు దగ్గరగా ఉండే పాత్రలో నటించింది.ఇందులో తెలుగు సీనియర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమా ఇటీవలే పూర్తికాగా ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ అందింది.ఇక ఈ సినిమా ట్రైలర్ ఇదివరకే విడుదల కాగా అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఇందులో రాజేంద్రప్రసాద్ రోల్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పోలి ఉంటుంది.ఇందులో ఈయన పాత్ర మేజర్ అట్రాక్షన్ గా మారింది.ఇందులో ఈయనకు అమ్మాయిల వీక్నెస్ ఉండటం వల్ల ఈ పాత్ర మరింత కీలకంగా మారుతుందని అర్థమవుతుంది.అంతేకాకుండా కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
ఇందులో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర్ మాస్టర్, రమేష్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో మంచి థ్రిల్ అందిస్తుందని దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు.
ఇక ఈ సినిమాను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నారు.