ముఖ్యమంత్రిగానే మాట్లాడుతున్న సోనేవాల్

కేంద్ర మంత్రి శర్వానంద్ సోనేవాల్ అప్పుడే అస్సాం ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు.అస్సాంలో కమలం పార్టీ ఘనవిజయం సాధించడంతో కాబోయే ముఖ్యమంత్రిగా సోనేవాల్ సంతోషంగా ఉన్నారు.

ఎన్నికలకు ముందే బీజేపీ ఈయన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో వేరే నాయకుడిని నియమించే అవకాశం లేదు.అంటే ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది.

ఈశాన్య భారతంలో బీజేపీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి.సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదుల, ముస్లీముల సమస్యలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని గెలిపించడం ఆశ్చర్యమే.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు