దేశంలో తీసుకు వచ్చిన కొత్త పౌరసత్వ చట్టంపై విపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఆందోళనలు చేస్తోంది.
ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం ఉంది అంటూ తాజాగా ఒక సభలో సోనియా గాంధీ అన్నారు.ప్రస్తుతం అక్కడ ప్రజలు భయాందోళన నడుమ జీవిస్తున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇంతగా చట్టంను జనాలు వ్యతిరేకిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ చట్టంను బలవంతంగా రుద్దుతుంది అంటూ ఈ సందర్బంగా ఆమె ప్రశ్నించింది.దేశంలో అనిశ్చితి వాతావరణం కల్పించడం, హింసకు తెర తీయడం మోడీ మరియు అమిత్ షాలకు కావాలని, వారు అదే చేస్తున్నారంటూ ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు ధైర్యం ఉంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలంటూ ఈ సందర్బంగా సోనియా గాంధీ సవాల్ విసిరింది.పరిస్థితి తీవ్రంగా ఉండటం వల్లే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న అనిశ్చితిని తొలగించాలంటే వెంటనే పౌరసత్వ కొత్త చట్టంను రద్దు చేయాలంటూ ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy