శాటిలైట్ లో జోష్ చూపించిన తేజ్ సోలో బ్రతుకు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాప్ సినిమాల తర్వాత చిత్రలహరి సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు.

ఆ తరువాత ప్రతి రోజు పండగే సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటరు అంటూ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులని, అది కూడా ఈ జెనరేషన్ యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.ఈ సినిమాతో మరో హిట్ ని తనఖాతాలో వేసుకోవడానికి తేజు సిద్ధం అవుతున్నాడు.

ఇక ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది.అయితే కరోనా ప్రభావంతో ఏమైనా వాయిదా పడుతుందేమో అనేది తెలియదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే బిజినెస్ రూపంలో నిర్మాతకి లాభాలు తెచ్చి పెట్టింది.ఈ సినిమా థీయట్రికల్ రైట్స్ ఇప్పటికే ప్రాంతాల వారీగా అమ్ముడైపోయాయి.

Advertisement

అది కూడా మంచి ధరకు బయ్యర్లు కొనేసారు.ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఏకంగా పదికోట్లు చెల్లించి జీ నెట్ వర్క్ సంస్థ కొనుగోలు చేసింది.

ఎవరేజ్ హీరో మీద ఇంత పెద్ద మొత్తంలో జీనెట్ వర్క్ పెట్టింది అంటే సినిమా మీద ఎంత నమ్మకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.మొత్తానికి రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ తో వస్తున్నా ఈ సినిమా మెగా ఫాన్స్ ని మరోసారి అలరించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు