భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచాయి.ఈమధ్యే వజ్రోత్సవాలు సైతం జరుపుకున్నాం.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా.ఇప్పటికీ సామాజిక జాఢ్యాలు తొలగిపోలేదు.
సంఘ బహిష్కరణ వంటి అంటరాని చర్యలు అక్కడక్కడ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.ఈ జాఢ్యలతో చాలా మంది బాధపడుతూనే ఉన్నారు.
ఈ సామాజిక జాఢ్యాల వల్ల చాలా మంది అమాయకులు మానసికంగా కుంగిపోతున్నారు.కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకాలో జరిగిన ఓ ఘటన మానవత్వానికి మచ్చగా మిగిలిపోయింది.హరవాడ గ్రామంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు పదేళ్లు గ్రామం నుండి బహిష్కరించారు.
బంట వెంకు గౌడ 10 ఏళ్ల క్రితం తన కుమారుడికి వివాహం చేశాడు.ఆ సమయంలోనే అదే గ్రామానికి చెందిన కుల పెద్దకు తాంబూలం ఇవ్వలేదు.దీంతో ఆవేశానికి గురైన ఆనంద సిద్ధ గౌడ.కులస్తులను పిలిపించాడు.పంచాయితీ పెట్టించి బంట వెంకు గౌడ కుటుంబాన్ని ఊరి నుండి బహిష్కరించారు.ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 ఏళ్లు వాళ్లు ఊరిలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు.

దీనిపై వెంకు గౌడ స్థానిక అధికారులకు విన్నవించుకున్నాడు.తన సమస్యలు చెప్పినా ఎన్నిసార్లు వాళ్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.బహిష్కరణతో మనస్తాపానికి గురైన వెంకు గౌడ కొన్నేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయాడు.ఆ కుటుంబం ఆనాటి నుండి అనేక ఇబ్బందులు పడుతూ వచ్చింది.ఈ వార్త క్రమంగా ఆనోటీ ఈనోటా ఉన్నతాధికారులకు తెలిసింది.వారి ఆదేశాల ప్రకారం స్థానిక అధికారులు కదలక తప్పలేదు.
గ్రామ బహిష్కరణ చేసిన పెద్దలను కఠినంగా శిక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.