తెలంగాణ రాష్ట్రంలో బయటకి కనిపించని బీఆర్ఎస్, బీజేపీ( BRS, BJP ) స్నేహం కొనసాగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ( Congress party ) నాయకులు ఆరోపిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.
బీజేపీ తో బీఆర్ఎస్ కి ఉన్న ఒప్పందం కారణంగానే లిక్కర్ స్కామ్ లో కవిత( Kavitha ) అరెస్ట్ అవ్వడం లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.బీజేపీ నాయకులు కూడా అదే అభిప్రాయంను వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయ్యింది.
బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి( Konda vishveshwara reddy ) తాజాగా ఢిల్లీ లో మీడియా తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.బీజేపీ తో బీఆర్ఎస్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రాష్ట్రంలో కొట్టుకున్నా కూడా ఢిల్లీలో బీఆర్ఎస్ మరియు బీజేపీ కలిసి ఉన్నాయి.అందుకే లిక్కర్ స్కామ్ లో అంత జరిగినా కూడా కవిత అరెస్ట్ కాలేదు అంటున్ఆనరు.
ఒక వేళ కవిత అరెస్ట్ అయ్యి ఉంటే రాష్ట్రం లో బీజేపీ బలం పెరిగి ఉండేది.
బీజేపీ ప్రభుత్వం ఎందుకు కవిత ని అరెస్ట్ చేయలేక పోతున్నారు అంటూ ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే కవిత అరెస్ట్ అవ్వాలంటూ కొండ విశ్వేశ్వరరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశాడు.మరో వైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం కవిత అరెస్ట్ అయితే దాన్ని పాజిటివ్ గా మార్చుకోగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్.
అందుకే బీజేపీ ఆమెను అరెస్ట్ అవ్వనివ్వడం లేదు అంటూ కొందరు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉండగా ఆమె అరెస్ట్ కాకుంటే బీజేపీకి నష్టం… అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి.
కవితకు బలం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.