నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఎన్టీఆర్’.క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్ నటీనటులు కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.
బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించగా ఇతర పాత్రల్లో రానా, కళ్యాణ్ రామ్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా పలువురు కనిపించబోతున్నారు.రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంపై ఎక్కువ ఆశక్తిని సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా ఈ చిత్రం మంచి కంటెంట్ ను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఎన్నో అద్బుతమైన సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాలకు సంబంధించిన మేకింగ్ విశేషాలను కొన్నింటిని ఈ చిత్రంలో క్రిష్ చూపించబోతున్నాడు.అందులో భాగంగానే ఎన్టీఆర్ చేసిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ కూడా ఉండబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో శ్రియ కనిపించబోతుంది.
దాన వీర శూర కర్ణ చిత్రం షూటింగ్ సమయంలో ద్రౌపదిగా శ్రియ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.శ్రియ వరుసగా బాలయ్య చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.తాజాగా ఈ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ దక్కింది.ఇక దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ లో కళ్యాణ్ రామ్ అర్జునుడిగా కనిపించబోతున్నాడు.అప్పట్లో హరికృష్ణ అర్జునుడి పాత్రలో నటించి మెప్పించాడు.ఇప్పుడు అర్జునుడి పాత్రను కళ్యాణ్ రామ్ పోషించబోతున్నాడు.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మరి అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
సంక్రాంతికి మొదటి పార్ట్, రెండవ పార్ట్ రిపబ్లిక్ డేకు విడుదల కాబోతుంది.