రజినీకాంత్ లేకుండానే ఆ సినిమా షూటింగ్ మొదలవబోతుంది

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా హీరోగా అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా కొత్త షూటింగ్ పూర్తయిపోయింది.తరువాత కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఇందులో ఖుష్బూ, నయనతార, మీనా హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు.కీర్తి సురేష్ ఈ సినిమాలో రజినీకాంత్ కూతురుగా కనిపించబోతుంది.

ఇదిలా వయస్సు రీత్యా ప్రస్తుత పరిస్థితులు రజినీకాంత్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు.ప్రభుత్వం నిబంధనల మేరకు వయస్సు మళ్ళిన వారు షూటింగ్ లో పాల్గొనడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి.

Advertisement

ఈ నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ పై కొంత గందరగోళం ఏర్పడింది.అయితే ఈ నెల ఆఖరున సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు శివ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

రజినీకాంత్ లేని సన్నివేశాలని ముందుగా షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత ఫిబ్రవరిలో రజినీకాంత్ కి సంబందించిన సన్నివేశాలు షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఒక్క రజినీకాంత్ తప్ప మిగిలిన నటులు అందరూ షూటింగ్ కి రెడీగానే ఉన్నారని సమాచారం.

నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు, మీనాలు ఇతర ముఖ్య నటీనటులతో షూటింగ్ చేయబోతున్నారు.దాదాపుగా 30 నుండి 35 రోజుల వరకు ఈ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు