బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జీరో సినిమా ద్వారా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.
దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఒక్క సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానటువంటి షారుక్ ఖాన్ త్వరలోనే పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.దీపిక పదుకొనే షారుఖ్ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనటువంటి షారుఖ్ ఖాన్ తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
షారుక్ ఖాన్ సినీ కెరియర్ లోనే పఠాన్ చిత్రం భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఇంటర్నేషనల్ ఏజెంట్ గా కనిపించనున్నారు.ఇందులో యాక్షన్స్ సన్నివేశాలు, కథాంశం హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోదని ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందంటూ మేకర్స్ వెల్లడించారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సాలిడ్ యాక్షన్ సినిమా చేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నానని తెలిపారు.
గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి తన కోరిక పఠాన్ సినిమా ద్వారా నెరవేరబోతుందని ఈ సినిమా ఇప్పుడు చేయకపోతే తన సినీ కెరియర్లో ఇలాంటి సినిమా చేయలేనని ఈయన వెల్లడించారు.ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదన్న ఉద్దేశంతో యాక్షన్స్ సన్ని వేషాలలో నటించడానికి కూడా ఓకే చెప్పానని తెలిపారు.56 సంవత్సరాల వయసులో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి శరీరం సహకరించదు అయితే ఈ అవకాశం ఇప్పుడు మిస్ చేసుకుంటే తన జీవితంలో ఇలాంటి సినిమాలలో నటించాలన్న తన కోరిక నెరవేరుదన్న ఉద్దేశంతో ఈయన ఈ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా మరి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.