మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.
ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా రేంజిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.
భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియాభట్ లాంటి స్టార్ కాస్టింగ్ భాగస్వామ్యం అవుతుండడం అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తరవాత దిల్ రాజు ప్రొడక్షన్ లో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత దర్శకుడు శంకర్ గతంలో తెరకెక్కించిన ఇండియన్ 2 మూవీ విషయంలో నిర్మాతలతో విభేదాల నేపథ్యంలో కోర్టు వరకు కేసు వెళ్ళింది.
ఇండియన్ 2 మూవీ పూర్తి చేయకుండా మరో కొత్త చిత్రాన్ని శంకర్ స్టార్ట్ చేయకుండా చూడాలని లైక ప్రొడక్షన్స్ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.అయితే ఈ విషయంలో లో దర్శకుడు శంకర్ అనుకూలంగానే కోర్టు నిర్ణయం వెలువడటం విశేషం.
అలాగే ఆ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిని కూడా నియమించారు.దీంతో సమస్య పరిష్కార దొరికినట్లయింది.
అయితే ఇండియన్ 2 గొడవ కారణంగా దిల్ రాజు రామ్ చరణ్ మూవీని తెరకెక్కించడానికి ఆసక్తి చూపించడం లేదనే పుకారు ఒకరు తెరపైకి వచ్చింది.తాజాగా దీనిపై రామ్ చరణ్, దిల్ రాజు కలిసి క్లారిటీ ఇచ్చారు.
చెన్నై లోని శంకర్ నివాసంలో ఆయన్ని కలుసుకుని సినిమాకు సంబంధించి కీలక విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక వీరు ముగ్గురు కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అలాగే ఈ సినిమాని సెప్టెంబర్ లో స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కూడా బయటకి రివీల్ చేశారు.దీన్నిబట్టి రామ్ చరణ్ ఇన్ కోసం శంకర్ ఇప్పటికే కంప్లీట్ కథను సిద్ధం చేసి ఉంచినట్లు టాక్ వినిపిస్తుంది.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఫైనల్ చేసినట్లు సమాచారం.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది
.