బాలీవుడ్ స్టార్ హీరోల్లో బాద్షా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ) ఒకరు.షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అదిరిపోయే హిట్ అందించాడు.మరి ఇంతటి విజయం సాధించిన తర్వాత ఈయన నెక్స్ట్ సినిమాపై ఆయన ఫ్యాన్స్ మరింత హోప్స్ పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కూడా వీరి అంచనాలను ఏమాత్రం తగ్గకుండా తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘జవాన్’ (Jawan Movie).
ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ( Atlee ) డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక పఠాన్ తర్వాత జవాన్ మీద మరింత అంచనాలు పెరిగాయి.
షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.ఇది నయనతారకు హిందీ డెబ్యూ మూవీ కావడం విశేషం.ఇక ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతూనే ఉంది.
మరి కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాలో అల్లు అర్జున్ ( Allu Arjun ) కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.ఈ సినిమాలో ఈయన ముఖ్యమైన పాత్రలో నటించాల్సి ఉండగా పుష్ప షూట్ కారణంగా ఈ సినిమాను ఒప్పుకోలేదని తెలుస్తుంది.
అయితే ఈయన ప్లేస్ లో విజయ్ దళపతి నటిస్తారని కూడా వార్తలు రాగా అవన్నీ పుకార్లు అని ఇప్పుడు తేలిపోయింది.తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ చేయాల్సిన పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) నటించ బోతున్నారని ముంబైలో 5 రోజుల పాటు షారుఖ్, సంజయ్ ల మీద భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించ నున్నట్టు తెలుస్తుంది.కేవలం రెండు వారాల షూట్ మాత్రమే మిగిలి ఉందట.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.