నెట్ ఫ్లిక్స్ కోసం గోదావరి సెలబ్రెటీలపై వంశీ వెబ్ సిరీస్

గోదావరి తీరంలో సినిమాలు అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు వంశీ.

ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలు అన్ని కూడా గోదావరితో ముడిపడి ఉంటాయి.

ఆయన కథల శైలి కూడా గోదావరి భాష, యాసతోనే ఉంటాయి.అలాగే చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఎలాంటి అసభ్యతకి చోటు లేని వినోదం ఆయన కథలలో కనిపిస్తుంది.

జంధ్యాల తర్వాత కామెడీ పరంగా తనదైన ప్రత్యేకత చూపించిన దర్శకుడు అంటే వంశీ పేరే వినిపిస్తుంది.అయితే గతంలో ఉన్నంత స్పీడ్ గా ప్రస్తుతం అతను సినిమాలు చేయడం లేదు.

వయస్సు రీత్యా సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గించేశారు.ఎవరైనా నిర్మాతలు దొరికితే తన టేస్ట్ కి తగ్గ సినిమాలు చేయడానికి ఇప్పటికి సిద్ధంగానే ఉన్నారు.

Advertisement

వంశీ నుంచి చివరిగా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమా వచ్చింది.ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ మధ్య ప్రముఖ ఓటీటీ ఛానల్ ఓ కాన్సెప్ట్ తో వెళ్లి దర్శకత్వ బాధ్యతలు చూడాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది.అయితే ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అని సమాచారం.

గోదావరి జిల్లా నుంచి వచ్చి సినీ పరిశ్రమలో సెలబ్రెటీలుగా మారిన ప్రముఖుల విశేషాలతో ఒక వెబ్ కథాంశం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇలాంటి కంటెంట్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కేవలం వంశీకి మాత్రమే ఉందని ఆయనని సంప్రదించడం జరిగిందని, ఆయన కూడా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుందని తెలుస్తుంది.త్వరలో దీనికి సంబంధించి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు