పుస్తకాలపై నిలబడి ఫోటోలకి ఫోజులిచ్చిన నటి! సీరియస్ అయిన నెటిజన్లు

పుస్తకాలని ఇండియాలో సరస్వతి స్వరూపంలో చూస్తారు.ఎవరైనా పుస్తకాలని నిర్లక్ష్యంగా విసిరిన, కాళ్ళతో తన్నిన ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్ లో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

క్షమించమని వేడుకోవాల్సిందిగా సూచిస్తారు.అంతగా ఇండియన్స్ ఆరాధ్యంగా భావించి పుస్తకాల మీద నిలబడి ఫోటోలకి ఫోజులు ఇస్తే ఎలా ఉంటుంది.

కచ్చితంగా కోపం వస్తుంది.ఇప్పుడు ఇదే కోపం హాలీవుడ్ నటి సెలీనా గోమేజ్ మీద భారతీయులకి వచ్చింది.

ఒక హాట్ ఫొటో షూట్‌ కోసం గోమేజ్ పుస్తకాల మీద నిలబడింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెని అభిమానించే భారతీయులతో పాటు, చాలా మంది ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisement

భారతీయులు సరస్వతీ దేవిగా పూజించే పుస్తకాలపై నిల్చుని హిందువుల మనోభావాలను గోమేజ్ తీవ్రంగా అవమానించింది అని సీరియస్ అయ్యారు.భారత సంస్కృతిలో పుస్తకానికి ఎంతో పవిత్ర ఉందని, చేసిన తప్పునకు శిక్ష అనుభవించక తప్పదని ఆమెకి సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.

చేసిన తప్పుకు వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.మరి ఇండియన్ నెటిజన్లు చేస్తున్న ఈ కామెంట్స్ పై సెలీనా గోమేజ్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు